పవన్కల్యాణ్ ప్రస్తుతం బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` రీమేక్లో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీకపూర్, దిల్ రాజు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండేళ్ల విరామం తరువాత పవన్ నటిస్తున్న ఈ చిత్రం లో ఆయన లాయర్గా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రసుత్తం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో నివేదా థామస్తో పాటు అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ఈ కోర్ట్ రూమ్ డ్రామా క్రైమ్ థ్రిల్లర్ కు `వకీల్ సాబ్` అనే టైటిల్ని దిల్ రాజు ఇటీవలే రిజిస్టర్ చేయించారు. దాదాపుగా ఇదే టైటిల్ కన్ఫమ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా నుంచి తమన్ ఫస్ట్ సింగిల్ని రిలీజ్ చేయబోతున్నాడు. ఇదిలా వుంటే ఈ సినిమాతో పాటు పవన్ మరో చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ బందిపోటు దొంగగా కనిపించబోతున్నారు.
ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లతో జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో పిరియాడిక్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్కు జోడీగా ఇద్దరు హీరోయిన్లని పరిశీలించిన క్రిష్ ఫైనల్గా మహానటి కీర్తి సురేష్ని ఫిక్స్ చేపుకున్నారని తెలిసింది.