Homeటాప్ స్టోరీస్నేను ఓడిపోతే నాకేమి నష్టం లేదు : కేసీఆర్

నేను ఓడిపోతే నాకేమి నష్టం లేదు : కేసీఆర్

KCR sensational comments on telangana electionsనేను ఓడిపోతే నాకేమి నష్టం లేదని , హాయిగా ఇంట్లో కూర్చుంటానని సంచలన వ్యాఖ్యలు చేసాడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు , ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ . ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లో ఈరోజు జరిగిన ఎన్నికల సభలో ఈ సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు కేసీఆర్ . టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే నాకు వచ్చే నష్టం ఏది లేదు , తెలంగాణ ప్రజలు మాత్రమే తీవ్రంగా నష్టపోతారని వ్యాఖ్యానించి ఎన్నికల ముందే చేతులు ఎత్తేసినట్లుగా ఉంది కేసీఆర్ వ్యవహారశైలి . కేసీఆర్ మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి .

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది , మహాకూటమి లో కాంగ్రెస్ – టిడిపి కలిసి పోటీ చేస్తున్నాయి దాంతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి . అలాగే చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు . అలాగే మరో ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కూడా టీఆర్ఎస్ ని వీడనున్నారని వార్తలు వస్తున్నాయి . అలాగే తెలంగాణలో కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నందున కేసీఆర్ లో ఓటమి భయం పట్టుకుందేమో అని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు .

- Advertisement -

English Title: KCR sensational comments on telangana elections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All