Homeటాప్ స్టోరీస్కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఎంపీ

కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఎంపీ

TRS MP Konda Vishweshwar reddy resigns to TRSచేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చాడు . అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు . కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు వారం రోజుల కిందటే ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే . టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అంటూ రేవంత్ చెప్పి గులాబీ శ్రేణుల్లో వణుకు పుట్టించాడు . కట్ చేస్తే ఇద్దరు ఎంపీలు మీడియా ముందుకు వచ్చి మేము పార్టీ మారడం లేదు అంటూ సెలవిచ్చారు . అందులో ఒకరు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాగా మరొకరు మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ . అయితే కొండా మాత్రం టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ఈరోజు మీడియా ముందుకు వస్తున్నానని తెలిపాడు .

పట్నం మహేందర్ రెడ్డి కి అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో కొండా గతకొంత కాలంగా లోలోన మదనపడుతున్నాడు . అంతేకాకుండా ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కేసీఆర్ కు స్పష్టం చేసాడు కొండా . అంతేకాకుండా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి ద్రోహులను మంత్రివర్గంలోకి తీసుకున్నారని నేరుగా కేసీఆర్ ని విమర్శించాడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి . పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాడు కొండా అలాగే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది .

- Advertisement -

English Title: TRS MP Konda Vishweshwar reddy resigns to TRS

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All