Homeగాసిప్స్త‌మిళ తెర‌కు విల‌న్‌గా తెలుగు హీరో!

త‌మిళ తెర‌కు విల‌న్‌గా తెలుగు హీరో!

త‌మిళ తెర‌కు విల‌న్‌గా తెలుగు హీరో!
త‌మిళ తెర‌కు విల‌న్‌గా తెలుగు హీరో!

`ఆర్ ఎక్స్ 100`తో క్రేజీ బ్లాక్ బస్ట‌ర్‌ని సొంతం చేసుకున్నారు యంగ్ హీరో కార్తికేయ‌. వాస్త‌విక సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమా అత‌న్ని హీరోగా, మంచి ఈజ్ వున్న న‌టుడిగా నిల‌బెట్టింది. దీంతో అత‌నికి వ‌రుస ఆఫ‌ర్‌లు రావ‌డం మొద‌లైంది. అయితే కార్తికేయ‌లోని మ‌రోయాంగిల్‌ని బ‌య‌ట పెట్టాల‌నుకున్న ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ అత‌న్ని `గ్యాంగ్‌లీడ‌ర్‌`లో విల‌న్‌గా కొత్త పంథాలో ఆవిష్క‌రించారు. అయితే సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక‌పోయింది. కానీ దేవ్ పాత్ర‌లో న‌టించి కార్తికేయ గుమ్మ‌కొండకు మాత్రం మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఈ సినిమానే కార్తికేయకు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌ని తెచ్చిపెట్టిన‌ట్టు తెలిసింది. అది కూడా త‌మిళ హీరో అజిత్ చిత్రంలో అని వార్త‌లు వినిపిస్తున్నాయి. `ఖాకీ`, నేర్కొండ పార్వై` చిత్రాల ద‌ర్శ‌కుడు హెచ్. వినోద్ ప్ర‌స్తుతం అజిత్ హీరోగా `వాలిమై` అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో క‌లిసి బోనీ క‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్ర‌ధాన విల‌న్‌గా కార్తికేయ‌ని అడుగుతున్నార‌ట‌. ఇందు కోసం ఆయ‌న‌కు భారీ ఆఫ‌ర్‌ని నిర్మాత బోనీక‌పూర్ ఇచ్చిన‌ట్టు తెలిసింది.

- Advertisement -

ప్ర‌స్తుతం చిత్ర బృందం కార్తికేయ‌తో చర్చలు జ‌రుపుతున్నార‌ట‌. డీల్ ఓకే అయితే ఈ విష‌యాన్ని హీరో కార్తికేయ‌తో పాటు, నిర్మాత బోనీ క‌పూర్ అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం కార్తికేయ గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు నిర్మిస్తున్న `చావు క‌బురు చ‌ల్ల‌గా` అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమాని చిత్ర బృందం అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించింది. జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభింకానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All