బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్ని సృష్టించాయి. ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్లా మారిందని కంగన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఈ వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్, మరో ఎమ్మెల్యే ఘాటుగా స్పందించడంతో వివాదం కాస్త శాంతి భద్రతల సమస్యగా మారింది.
దీంతో కంగనకు కేంద్రం సెక్యూరిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ముంబైలో కంగన ఈ నెల 9న అడుగు పెడుతున్నానని శివసేనకు సవాల్ విసరడంతో ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. కర్ణిసేనతో పాటు కంగనకు ముంబైలో కేంద్రం భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది. దీంతో శివసేన సైలెంట్ అయిపోయింది. ఇదిలా వుంటే కంగన సెక్యూటిరీ ఖర్చు ఎంత? ఆ ఖర్చు భరిస్తోంది ఎవరు? అన్న చర్చ మొదలైంది.
తాజా సమాచారం ప్రకారం కంగన సెక్యూరిటీ నెల ఖర్చు 10 లక్షలని తెలిసింది. ఈ భారీ మొత్తాన్ని కంగన భరించడం లేదట. షాకింగ్ విషయం ఏంటంటే ఈ మొత్తాన్ని కేంద్రమే భరిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. శివసేనపై కంగన రంకెలేస్తుండటంతో కంగన బీజేపీకి దగ్గరవుతోంది. ఈ నేపథ్యంలో ఈ వాతావరణాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని కేంద్రంలో వున్న బీజేపీ ప్రభుత్వం కంగన భద్రత ఖర్చుల్ని భరిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.