దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి పురుచ్చితలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం `తలైవి`. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. జయలలిత పాత్రలో కంగన నరౌత్ నటిస్తోంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్రాజ్ కరుణానిథిగా, అరవిందస్వామి ఎమ్జీఆర్గా నటిస్తున్నారు.
కీలక ఘట్టాలని పూర్తి చేసి చిత్ర బృందం చెన్నైలోని ఏవీఎం స్టూడియోతో పాటు హైదరాబాద్లోని రామకృష్ణా హార్టీకల్చరల్ సినీ స్టూడియోస్లో భారీ సెట్లని నిర్మించారు. లా సెట్లలో 45 రోజుల పాటు మార్చి 10 నుంచి షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారు. హైదరాబాద్లో రెండు షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. రామకృష్ణా హార్టీకల్చరల్ సినీ స్టూడియోస్లో పార్లమెంట్ సెట్ని కూడా నిర్మించారు.
అనూహ్యంగా కరోనా దెబ్బ వల్ల షెడ్యూల్ మొత్తం అప్సెట్ అయిపోయింది. దీంతో మేకర్స్కి దాదాపు 5 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం వుందని ఈ విషయాన్ని నిర్మాతలలో ఒకరైన శైలేష్ ఆర్. సింగ్ ఓ బాలీవుడ్ మీడియాతో వెల్లడించినట్టు తెలిసింది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ చిత్రాన్ని జూన్ 26న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ ప్లాన్ మొత్తం కరోనా దెబ్బతో మారిపోయింది.