ఫైర్ బ్రాండ్ కంగన ప్రముఖ సీనియర్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్కే అదిరే పంచ్ ఇచ్చింది. గత కొంత కాలంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన కంగన తాజాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై పలు సంచలన కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ముంబైని ఆక్రమిత కశ్మీర్ లా వుందని కామెంట్ చేసిన కంగన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
ఇదిలా వుంటే కంగన రనౌత్ వుందని ఓ సినిమా నుంచి తాను తప్పుకున్నట్టు పీసీ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. `కంగన రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోందని ఆ చిత్రాన్ని వదులుకున్నా. ఎందుకో ఆ ప్రాజెక్ట్ చేయడానికి నా మనసు అంగీకరించలేదు. ఇదే విషయాన్ని మేకర్లకు వివరించా. వారు అర్థం చేసుకున్నారు. ఒక్కోసారి మన మనసు చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంటుంది. ఆ టీమ్కి ఆల్ ద బెస్ట్` అని ట్వీట్ చేశారు.
దీనికి కంగన దిమ్మదిరిగే రిప్లై ఇచ్చింది. `మీరో లెజెండ్. మీతో కలిసి పనిచేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నా. నిజంగా ఇది నాకు పెద్ద నష్టం లాంటిది. నా గురించి మీరు ఏ విషయంలో ఇబ్బంది పడ్డారో నాకు తెలియదు. కానీ మీరు మంచి నిర్ణయం తీసుకున్నారని సంతోషిస్తున్నా. మీకు ఆల్ ది బెస్ట్` అని స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.