కమల్హాసన్ నటిస్తున్న సంచలన చిత్రం `ఇండియన్`. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి తాజాగా `ఇండియన్2` పేరుతో సీక్వెల్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కమల్హాసన్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. రకుల్ ప్రీత్సింగ్, సిద్ధార్ధ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇటీవల చెన్నైలోని ఓ స్టూడియోలో షూటింగ్ చేస్తుండగా క్రేన్ విరిగిపడి ఈ చిత్ర సిబ్బంది ముగ్గురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి వార్తల్లో నిలుసత్తున్న ఈ చిత్రంపై తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. క్రేన్ ఘటన తరువాత చిత్ర బృందానికి, కమల్కి మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రాన్ని ఆపేశారంటూ ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై లైకా సంస్థ క్లారిటీ ఇచ్చింది.
ఈ చిత్రం ఆగిపోలేదని, లాక్డౌన్ అనంతర పరిస్థితులని బట్టి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించింది. ఇప్పటి వరకు 60 శాతం చిత్రీకరణ పూర్తయిందని, ఈ నేపథ్యంలో ఎలా సినిమాని ఆపేస్తామని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. లాక్డౌన్ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు షూటింగ్లకు అనుమతిస్తే అప్పుడే షూటింగ్ మొదలుపెడతామని స్పష్టం చేసింది.