Homeటాప్ స్టోరీస్క‌మ‌ల్‌హాస‌న్‌పై కూడా ప్ర‌చారం మొద‌లైంది!

క‌మ‌ల్‌హాస‌న్‌పై కూడా ప్ర‌చారం మొద‌లైంది!

క‌మ‌ల్‌హాస‌న్‌పై కూడా ప్ర‌చారం మొద‌లైంది!
క‌మ‌ల్‌హాస‌న్‌పై కూడా ప్ర‌చారం మొద‌లైంది!

క‌రోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతుండ‌టంతో పుకార్లు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న‌ట్టుగా ఆక‌తాయిలు, తెలిసిన వాళ్లు , తెలియ‌ని వాళ్లు త‌ప్పుడు వార్తల్ని న‌మ్ముతూ అవే నిజ‌మ‌నుకుని వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వ‌ర్డ్ చేస్తున్నారు. కొంత మంది ఇప్ప‌టికే బుక్క‌యిపోతున్నారు. కొంత మంది ఇవ‌న్నీ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఫేక్ న్యూస్ క‌మ‌ల్‌హాస‌న్‌పై స్ప్రెడ్ చేయ‌డం మొద‌లైంది.

క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా దేశం మొత్తం లాక్‌డౌన్‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో సెల‌బ్రిటీల‌తో పాటు, సామాన్యులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయి సెల్ఫ్ క్వారెంటైన్‌లుగా త‌మ భ‌ద్ర‌త‌ని తామే చూసుకుంటున్నారు. ఇదిలా వుంటే క‌మ‌ల్‌హాస‌న్ త‌న ఇద్ద‌రు కుమార్తెల‌తో క‌లిసి ఇంట్లోనే వుంటున్నాడు. ఒక్కొక్క‌రు ఒక్కో గ‌దుల్లో వుండి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అయితే క‌మ‌ల్ క‌రోనా వైర‌స్ టెస్ట్‌కి క‌మ‌ల్ అంగీక‌రించ‌లేద‌ని, ఆ కార‌ణంగానే కార్పొరేష‌న్ అధికారులు క‌మ‌ల్ ఇంటి ముందు స్టిక్క‌ర్లు అంటించారని ప్ర‌చారం మొద‌లైంది.

- Advertisement -

క‌మ‌ల్ నుంచి గౌత‌మి విడిపోయినా ఆమె పాస్ పోర్ట్ మాత్రం క‌మ‌ల్ ఇంటి  అడ్ర‌స్‌తోనే వుంద‌ట‌. ఆమె ఇటీవ‌లే దుబాయ్ నుంచి తిరిగి వ‌చ్చారు. దీంతో క‌మ‌ల్ ఇంటి ముందు చెన్నై కార్పొరేష‌న్  సిబ్బంది  క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన స్టిక్క‌ర్ల‌ని అంటించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ వార్త‌ల్ని క‌మ‌ల్ కండించిన‌ట్టు తెలిసింది. త‌మ ఇంటిలో ఎవ‌రు విదేశాల నుంచి వ‌చ్చిన వాళ్లు లేర‌ని, త‌మపై జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజం లేద‌ని స్ప‌ష్టం చేశార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All