Homeటాప్ స్టోరీస్“ఎక్ విలన్ 2” లో ఈసారి ఇద్దరు

“ఎక్ విలన్ 2” లో ఈసారి ఇద్దరు

John Abraham becoming full time villain in Bollywood
John Abraham becoming full time villain in Bollywood

ఆషికీ 2 సినిమా తర్వాత సిద్దార్థ్ మల్హోత్రా &శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ మోహిత్ సూరి తీసిన సినిమా ఎక్ విలన్. మరొక బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఆషికీ 2 మూడ్ లో సూపర్ హిట్ అయ్యింది. అందులో హీరో చచ్చిపోతాడు; ఇందులో హీరోయిన్ చచ్చిపోతుంది. ఆ ఒక్కటే తేడా. ఇక డైరెక్టర్ మొహిత్ సూరి ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో ఇద్దరు హీరోలు; ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలియచేసారు. ఇక మేల్ లీడ్ క్యారెక్టర్స్ కి జాన్ అబ్రాహం, ఆదిత్యరాయ్ కపూర్ ఫైనల్ కాగా, వారి పక్కన సెట్ అయ్యే హీరోయిన్స్ కోసం మూవీ టీం ప్రస్తుతం వర్క్ చేస్తోంది. ఇక ఈ సినిమా కూడా లవ్ జోనర్ క్రైమ్ & యాక్షన్ థీం లో ఉండచ్చని ఆశించవచ్చు. ఇక సినిమా టైటిల్ పరంగా చూస్తే “ఎక్ విలన్ 2” అంటే, ఇద్దరిలో ఒక విలన్ ఉంటారా.? లేక ఇద్దరూ విలన్ షేడ్స్ లో కనిపించే హీరోలా.? లేక ఇంకొక విలన్ క్యారెక్టర్ ని వీరిద్దరి మధ్య ఎంటర్ చేస్తారా.? అని మూవీ లవర్స్ డిస్కషన్స్ చేస్తున్నారు.

- Advertisement -

మోహిత్ సూరి సినిమా అంటేనే, మ్యూజిక్, స్క్రీన్ ప్లే, హీరో & హీరోయిన్స్ కెమిస్ట్రీ ప్రధానంగా ఉంటాయి. ఇప్పటికే జాన్ అబ్రహం అటు హీరోగా, ఇటు విలన్ గా రాణిస్తున్నారు. కానీ ఆయన సోలో హీరోగా సినిమా వచ్చి, చాలా కాలం అయ్యింది. బాలీవుడ్ లో సీనియర్ ఖాన్స్ తో పాటు ఎంట్రీ ఇచ్చిన జాన్ అబ్రహాంను ఇండస్ట్రీ నెమ్మదినెమ్మదిగా విలన్ క్యారెక్టర్లకు అలవాటు చేస్తోంది. ఇక ఈ సినిమా హిట్ అయితే జాన్ అబ్రహాం బాలీవుడ్ లో విలన్ గా సెటిల్ అయిపోవచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All