Homeగాసిప్స్సిద్దార్థ్ పై కేసు నమోదు

సిద్దార్థ్ పై కేసు నమోదు

హీరో సిద్దార్థ్ పై కేసు అనగానే మన తెలుగు , తమిళ హీరో సిద్దార్థ్ అనుకుంటున్నారా ? కాదు సుమా బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా . ఇటీవల తన సినిమా ప్రమోషన్ నిమిత్తం ఓ కార్యక్రమానికి వెళ్లిన సిద్దార్థ్ మల్హోత్రా అక్కడ భోజ్ పురి భాషపై చేసిన సరదా కామెంట్ తీవ్ర వివాదానికి కారణం అయ్యింది అయితే వివాదం ఎక్కువ కావడంతో క్షమాపణ కూడా చెప్పాడు కానీ భోజ్ పురి వాసుల కోపం మాత్రం తగ్గలేదు దాంతో అతడిపై కేసు నమోదు అయ్యింది . 
 
క్షమాపణ చెప్పినా సిద్దార్థ్ మల్హోత్రా ని క్షమించేది లేదని 22 కోట్ల భోజ్ పురి వాసుల మనోభావాలను దెబ్బ తీసాడని అతడిపై గరం గరం అవుతున్నారు . అంతేకాదు అతడి పై కేసు కూడా నమోదు అయ్యింది దాంతో ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను అంటూ తల పెట్టుకుంటున్నాడు హీరో సిద్దార్థ్ మల్హోత్రా . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All