జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ ఇవ్వడానికి సిద్దమయ్యాడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ . ఉద్యోగ పదవీ విరమణ చేసిన జేడీ లక్ష్మీనారాయణ ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరుపున విశాఖపట్టణం నుండి లోక్ సభకు పోటీ చేసాడు . అయితే ఘోరంగా ఓడిపోయాడు జేడీ అయినప్పటికీ జనసేన లోనే ఉండాలని అనుకున్నాడట ! కానీ పవన్ కళ్యాణ్ ని కలవాలంటే కూడా జేడీ లాంటి నాయకుడికి సరైన ప్రాధాన్యత లేకపోవడంతో విసిగిపోయిన జేడీ జనసేనని వదిలి బీజేపీ లోకి వెళ్ళడానికి డిసైడ్ అయ్యాడట .
త్వరలోనే అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చేరనున్నాడని సమాచారం . జనసేన కు జేడీ అండగా ఉంటాడని అనుకుంటే కష్టకాలంలో పవన్ కళ్యాణ్ కు షాక్ ఇస్తూ కాషాయ కండువా పట్టుకోవడానికి రెడీ అయ్యాడట జేడీ లక్ష్మీనారాయణ . జేడీ కి సమాజంలో మంచి పేరుంది కానీ ఎన్నికల్లో జనసేన బలంగా లేకపోవడం వల్ల ఓడిపోయాడు . ఇక ఇప్పుడు బీజేపీ లో చేరితే అదనపు బలం చేకూరడం ఖాయం అనుకుంటా .