తమిళ హీరో విజయ్ ఇంటిపై వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇటీవల విజయ్తో ఏజీఎఫ్ ప్రొడక్షన్స్ సంస్థ `బిగిల్` చిత్రాన్ని నిర్మించింది. ఈ సంస్థ కార్యాయలంలోనూ ఐటీ సోదాలు జరగడం కలకలం రేపుతోంది. హీరో విజయ్ ప్రస్తుతం `ఖైదీ` హేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న `మాస్టర్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలోని నైవేలిలో జరుగుతోంది.
అక్కడికి హఠాత్తుగా బుధవారం వెళ్లిన ఐటీ అధికారులు అక్కడి నుంచి హీరో విజయ్ని అతని ఇంటికి తీసుకొచ్చారట. ఆ తరువాత ఇంటలో సోదాలు నిర్వహించారట. అక్కడితో ఆగక `బిగిల్` చిత్ర నిర్మాతల ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహించారని, అలాగే విజయ్కి ఫైనాన్స్ చేసే అన్బు చెళియన్ ఇంట్లోనూ సోదాలు చేయడంతో అతని వద్ద లెక్కలో లేని 65 కోట్లు లభించినట్టు తమిళ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. హీరో విజయ్నే ఎందుకు టార్గెట్ చేశారు?. దీని వెనక రాజకీయ కుట్ర కొణం వుందా? అని తమిళ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇటీవల వచ్చిన చిత్రాల్లో హీరో విజయ్ అధికార బీజేపీని విమర్శిస్తూ జీఎస్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తమిళనాడులో అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. విజయ్ `మెర్సల్` చిత్రాన్ని బ్యాన్ చేయాల్సిందే అంటూ చెన్నైకి చెందిన బీజేపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు కూడా. అయితే వివాదాస్పద డైలాగ్లని మ్యూట్ చేయడంతో విడుదలకు అనుమతినిచ్చారు. అలా విజయ్ `మెర్సల్` రాజకీయ వివాదం నుంచి బయటపడింది. ఆ విషయాల్ని దృష్టిలో పెట్టుకుని అధికార బీజేపీ హీరో విజయ్పై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని విజయ్ ఫ్యాన్స్ బీజేపీ వర్గాలపై మండిపడుతున్నారు.