రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రానికి దర్శకత్వం వహించింది శ్రీను వైట్ల . అయితే వరుస పరాజయాలతో కెరీర్ డైలమాలో ఉన్న సమయంలో భారీ సినిమాలు నిర్మిస్తున్న మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు రావడంతో వెనుక ఏదో పెద్ద మతలబు ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి . రవితేజ కూడా ఫ్లాప్ లలో ఉన్న హీరో అయితే కొంతవరకైనా క్రేజ్ ఉంది పైగా ఎంతో కొంత బిజినెస్ చేస్తుంది అతడితో సినిమా చేస్తే కానీ శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా నిర్మిస్తే మాత్రం బిజినెస్ అవ్వడం కష్టమే ! ఎందుకంటే ఘోరమైన ఫ్లాప్ లను చూసాడు దాంతో డైరెక్టర్ గా అతడి కెరీర్ క్లోజ్ అయినట్లే అని అనుకున్న సమయంలో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం రావడం సంచలనం అయ్యింది .
అయితే ఈ సినిమా రావడానికి కారణం శ్రీను వైట్ల ఈ సినిమాలో పెట్టుబడులు పెట్టడమే అన్న మాట వినిపిస్తోంది . పారితోషికం తీసుకోకుండా డైరెక్షన్ చేయడమే కాకుండా బడ్జెట్ లో కొంత మొత్తాన్ని పెట్టినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి . ఇది శ్రీను వైట్ల కు కెరీర్ పరంగా జీవన్మరణ సమస్య దాంతో తెగించి డబ్బులు పెట్టినట్లు తెలుస్తోంది . ఒకప్పుడు అగ్ర శ్రేణి దర్శకుడిగా చెలామణి అయిన శ్రీను వైట్ల కు వరుస ఫ్లాప్ లతో ఒక్కసారిగా పాతాళంలో పడిపోయాడు . శ్రీను వైట్ల – రవితేజ ల కాంబినేషన్ లో వచ్చిన మూడు చిత్రాలు హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి .
English Title: IS Srinu vaitla invest in amar akbar antony ?