తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి ఓటమి భయం పట్టుకుందని అందుకే గజ్వేల్ లో పోటీ చేయకుండా సురక్షిత స్థావరమైన సిద్ధిపేట నుండి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది . తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేసిఆర్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది . గజ్వేల్ లో గత ఎన్నికల సందర్భంగా పోటీ చేసి గెలుపొందాడు కేసిఆర్ , అయితే ముఖ్యమంత్రి అయినప్పటికీ అనుకున్న స్థాయిలో అక్కడ అభివృద్ధి జరగలేదు దానికి తోడూ కేసిఆర్ పై పోటీ చేస్తోంది ఒంటేరు ప్రతాప్ రెడ్డి . తెలుగుదేశం పార్టీ వ్యక్తీ అయినప్పటికీ కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నాడు ఒంటేరు . గజ్వేల్ లో ఒంటేరు ప్రతాప్ రెడ్డి కి వ్యక్తిగత ఇమేజ్ ఉంది అలాగే కేసిఆర్ లాగే ఒంటేరు కూడా మంచి మాటకారి ,తూటకారి కూడా .
కాంగ్రెస్ – టిడిపి సంయుక్త అభ్యర్ధిగా ఒంటేరు పోటీ చేస్తుండటం ఒక కారణమైతే , ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత ఉండటం కూడా మరో కారణం . ఈ రెండు కారణాలతో గజ్వేల్ లో పోటీ చేయకుండా సిద్ధిపేట నుండి పోటీ చేయాలనీ ఆలోచన చేస్తున్నాడట కేసిఆర్ . ఇటీవల నిర్వహించిన సర్వేలో కేసిఆర్ గ్రాఫ్ గణనీయంగా పడిపోవడంతో గజ్వేల్ లో పోటీకి భయపడుతున్నాడట . అందుకే సిద్ధిపేట నుండి పోటీ చేస్తాడని వినిపిస్తోంది . ఇంతకుముందు కేసిఆర్ సిద్ధిపేట నుండి పలుమార్లు పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే .
English Title: Is KCR quit from Gajwel