విజయ్ ఏవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ వరుసగా వార్తల్లో నిలుస్తోంది. పూరి, చార్మితో కలిసి బాలీవుడ్ నిర్మాతలు కరణ్ జోహార్, అపూర్వ మొహతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ గత కొన్ని రోజులుగా ముంబైలో జరుగుతోంది.
ఇటీవల విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండేపై బైక్ ఛేజింగ్ దృశ్యలని దర్శకుడు పూరి జగన్నాథ్ అర్థ్ర రాత్రి ముంబై గల్లీల్లో తెరకెక్కించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా ద్వారా బయటికి రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇంటర్నేషనల్ బాక్సర్ని రంగంలోకి దింపేస్తున్నారట.
ముందు ఈ పాత్ర కోసం ఇంటర్నేషనల్ బాక్సర్ మైక్ టైసన్ని బరిలోకి దించాలని పూరి భావించాడు కానీ అది సాధ్యం అయ్యే సనిలా కనిపించకపోవడంతో ఆ ప్రయత్నాల్ని విరమించుకున్నపూరి అతని స్థానంలో ఇంటర్నేషనల్ బాక్సర్ని తీసుకుంటున్నారట. ప్రస్తుతం రెమ్యునరేషన్కు సంబంధించిన టాక్స్ నడుస్తున్నాయని, వన్స్ ఫిగర్ ఎంతన్నది తేలిపోతే ఫైనల్ అనౌన్స్ మెంట్ టీమ్ నుంచి వస్తుందని తెలుస్తోంది. వచ్చే వారం ముంబై షెడ్యూల్ పూర్తి కాబోతోంది.