Homeటాప్ స్టోరీస్అబ్బో, చైతూ ప్లానింగ్ మాములుగా లేదుగా

అబ్బో, చైతూ ప్లానింగ్ మాములుగా లేదుగా

Interested details about NC20
Interested details about NC20

జోష్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇప్పటికీ మిడ్ రేంజ్ హీరోగానే ఉండిపోయాడు. కన్సిస్టెంట్ గా హిట్ సినిమాలు ఇవ్వడంలో విఫలమవుతున్నాడు నాగ చైతన్య. ఒక సూపర్ హిట్ వచ్చిందంటే రెండు, మూడు ప్లాపులతో కెరీర్ మళ్ళీ మొదటికి వస్తోంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య ఈసారి తన కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టాడు. ఇటీవలే భార్య సమంతతో కలిసి చేసిన మజిలీ సూపర్ హిట్ అవ్వడంతో తన మార్కెట్ పెంచుకునే అవకాశాన్ని వదులుకోవాలనుకోవట్లేదు. వరసగా ఆసక్తికర సినిమాలను లైన్లో పెడుతున్నాడు. కెరీర్ మీద ఫోకస్ తో ఎలాంటి సినిమా చేయాలా అన్న ఆలోచనతో ఎక్కువ సమయం వృధా చెయ్యట్లేదు చైతూ. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను ప్రకటించేస్తున్నాడు. ఇప్పుడు నాగ చైతన్య నటించిన సినిమా ఒకటి విడుదలకు సిద్ధంగా ఉండగా, ఒక సినిమా సెట్ పై ఉంది, మరొక సినిమాను ఓకే చేసే పనిలో ఉన్నాడు.

మజిలీ హిట్ తర్వాత మావయ్య వెంకటేష్ తో కలిసి వెంకీ మామ సినిమాను పూర్తి చేసాడు చైతూ. డిసెంబర్ 13న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఆ రోజు వెంకటేష్ పుట్టినరోజు కావడం విశేషం. ఇప్పటికే చైతన్య తన తర్వాతి సినిమాను మొదలుపెట్టేసిన సంగతి తెల్సిందే. సాయి పల్లవి హీరోయిన్ గా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య చేస్తున్న సినిమా అప్పుడే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ త్వరలోనే మొదలవుతుందని తెలుస్తోంది. మార్చ్ కల్లా షూటింగ్ ను పూర్తి చేసి సమ్మర్ లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ యూనిట్. ఫిదా వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల నుండి రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన చిన్న టీజర్ లో చైతూ శేఖర్ కమ్ముల సినిమాల్లోని హీరోల్లానే చాలా సింపుల్ గా ఉంటూ ఆకట్టుకుంటున్నాడు.

- Advertisement -

ఇదిలా ఉంటే నాగ చైతన్య 20వ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న పరశురామ్ నాగ చైతన్యతో తన తర్వాతి సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. లైన్ విన్న చైతూ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ కు పచ్చ జెండా ఊపేసాడని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే వేసవికి పరశురామ్ – నాగ చైతన్య కాంబినేషన్ లో సినిమా మొదలవుతుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించనుంది. ఫుల్ స్క్రిప్ట్ పూర్తవ్వగానే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి. గీత గోవిందం సినిమా తర్వాత పరశురామ్ స్టార్ హీరోతో సినిమా చేయాలని దాదాపు ఏడాది పాటు ఎదురుచూశాడు. మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోలకు కథలను నరేట్ చేసాడు కానీ అటువైపు నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో అక్కినేని హీరోతో సినిమాను సెట్ చేస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All