కోలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుకున్న అసురన్ సినిమా ఇండియన్ సినీ లవర్స్ ని ఎంతగానో ఆకర్షించింది. ప్రతి ఇండస్ట్రీలో చాలా మంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక రీమేక్ హక్కుల కోసం పోటీ పెరుగుతున్న సమయంలో ముందస్తు ఆలోచనతో నిర్మాత సురేష్ బాబు తెలుగు హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన ఒక స్పెషల్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో వైరల్ అవుతోంది. సినిమాకు ఓంకార్ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలైతే ఓంకార్ తో వెంకీ రాజుగారి గది ఫార్మాట్ లోనే పార్ట్ 4 తీయాలని అనుకున్నారు. ఈ విషయంపై ఓంకార్ కూడా క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు సురేష్ బాబు ఆలోచనతో అసురన్ కథపై ఓంకార్ ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
తమిళ్ లో దాదాపు 100కోట్లకు పైగా వసూళ్లను అందుకున్న అసురన్ కి వెట్రి మారన్ దర్శకత్వం వహించాడు. ఈ యాక్షన్ డ్రామా కథలో ధనుష్ విభిన్న గెటప్పుల్లో స్క్రీన్ పై అద్భుతమైన నటనను ప్రజెంట్ చేశాడు. ఇక ఇప్పుడు వెంకటేష్ కూడా ఆ డే తరహాలో న్యాయం చేయడానికి తనదైన శైలిలో సిద్దమవుతున్నాడు. అయితే ఓంకార్ ఈ ప్రాజెక్ట్ ని ఎంతవరకు డీల్ చేస్తాడో చూడాలి.
- Advertisement -