Homeటాప్ స్టోరీస్ఇండియాలో దూసుకుపోతున్న ఫ్రోజెన్ 2

ఇండియాలో దూసుకుపోతున్న ఫ్రోజెన్ 2

ఇండియాలో దూసుకుపోతున్న ఫ్రోజెన్ 2
ఇండియాలో దూసుకుపోతున్న ఫ్రోజెన్ 2

సీక్వెల్స్ ఎక్కువగా వస్తోన్న 2019లో మరో హాలీవుడ్ యానిమేటడ్ చిత్రం విడుదలైంది. 2013లో వచ్చిన వాల్ట్ డిస్నీ వారి హాలీవుడ్ చిత్రం ఫ్రోజెన్ కు సీక్వెల్ గా గత వారం ఫ్రోజెన్ 2 విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మధ్య హాలీవుడ్ సినిమాలు ఇండియా మార్కెట్ పై బాగా దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా యానిమేటెడ్ సిరీస్ అయితే అందులో ప్రముఖ పాత్రలకు ఇండియాలోని టాప్ స్టార్స్ చేత డబ్బింగ్ చెప్పిస్తుండడం బాగా కలిసొస్తోంది. ఈ ఏడాది విడుదలైన ది లయన్ కింగ్ కు ఇలానే చేసారు. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, తెలుగు నుండి నాని, జగపతి బాబు, బ్రహ్మానందం, అలీ వంటి స్టార్స్ ఇంపార్టెంట్ రోల్స్ కు డబ్బింగ్ చెప్పి క్రేజ్ తీసుకొచ్చారు. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనం చూసాం.

ఇప్పుడు ఫ్రోజెన్ 2 విషయంలో కూడా ఇదే చేసారు. ఇందులో ఎల్సా పాత్రకు తెలుగులో నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పింది. అలాగే చిన్నప్పటి ఎల్సా పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ చిత్రం ఇప్పుడు ఇండియాలో మంచి వసూళ్లను రాబడుతోంది. తొలి వీకెండ్ లోనే ఫ్రోజెన్ 2 అదరగొట్టింది. మొదటి మూడు రోజులకే దాదాపు 18 కోట్లను కొల్లగొట్టింది ఫ్రోజెన్ 2. వీక్ డేస్ లో డ్రాప్ కనిపించినా కూడా సినిమా నిలబడింది. మొత్తంగా ఇప్పటివరకూ 25 కోట్ల రూపాయల షేర్ ను దాటింది ఫ్రోజెన్ 2.

- Advertisement -

2013లో అందరినీ అలరించిన ఫ్రోజెన్ దాదాపుగా 1.28 బిలియన్ డాలర్స్ ను వసూలు చేసిన సంగతి తెల్సిందే. ఇప్పుడు దాని సీక్వెల్ ఫ్రోజెన్ 2 కూడా తక్కువేం తినలేదు. ఇప్పటికే దాదాపుగా 500 మిలియన్ డాలర్లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. తొలి పార్ట్ లో ఆకట్టుకున్న ఎల్సా, అన్నా, క్రిస్టోఫ్, ఓలాఫ్ వంటి పాత్రలు, సీక్వెల్ లో కూడా కనిపించబోతున్నాయి. ముఖ్యంగా ఈ సీక్వెల్ లో ఎల్సా కు పవర్స్ ఎలా వచ్చాయి అన్న విషయాన్ని చర్చించారు.

ముఖ్యంగా పిల్లలను ఉద్దేశించి తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుండడం విశేషం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All