కరోనా మహమ్మారి హైదరాబాద్ లో కరాళ నృత్యం చేస్తోంది. ప్రజా ప్రతినిధులని కూడా వదలడం లేదు. తాజాగా జీహెచ్ ఎంసీ మేయర్ డ్రైవర్ కు కరోనా వైరస్ సోకడం కలకలం రేపుతోంది. అతని కారణంగా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కు కరోనా సోకవచ్చని కరోనా పరీక్షలు చేశారు.
ఇటీవల తొలి సారి కరోనా పరీక్షలు చేశారు. నెగెటివ్ వచ్చింది. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ మరోసారి కోవిడ్ పరీక్షల్ని నిర్వహించగా మళ్ళీ నెగెటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు
క్షేత్ర స్థాయిలో పర్తించిన సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ రోడ్డు సైడ్ టీ స్టాల్ లో టీ తాగారట. ఆ టీ షాప్ వ్యక్తికి కరోనా సోకడంతో జాగ్రత్త పడిన మేయర్ వారం క్రితమే కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు.
- Advertisement -