Homeటాప్ స్టోరీస్నిశ్శ‌బ్దంగా వుంటే చ‌రిత్ర క్ష‌మించ‌దు!

నిశ్శ‌బ్దంగా వుంటే చ‌రిత్ర క్ష‌మించ‌దు!

History will never forgive us  Prakash Raj
History will never forgive us Prakash Raj

కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ కొత్త‌గా ప్ర‌వేశ పెట్టిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (సీఏఏ)పై దేశ వ్యాప్తంగా నిర‌స‌న జ్వాల‌లు రేగుతున్న విష‌యం తెలిసిందే. ఈ బిల్లు దేశానికి ఏ మాత్రం శ్రేయ‌స్క‌రం కాద‌ని, ఇది దేశ విభ‌జ‌న‌కు కార‌ణం అయ్యే ప్ర‌మాదం వుంద‌ని, దీన్ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఆమోదించ‌మ‌ని వెంట‌నే ఈ బిల్లును ర‌ద్దు చేయాల‌ని విద్యార్థులు, మేధావులు ముక్త కంఠంతో వ్య‌తిరేకిస్తున్నారు. ఇటీవ‌ల ఢిల్లీలోని జ‌మియా మిలియా ఇస్లామియా యూనివ‌ర్శిటీ విద్యార్థుల‌పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసిన విష‌యం తెలిసిందే.

దీనిపై దేశ వ్యాప్తంగా వున్న మేధావులు మండిప‌డుతున్నారు. దేశాన్ని బీజేపీ ప్ర‌భుత్వం స‌ర్వ‌నాశం చేస్తోంద‌ని, నియంతృత్వ పోక‌డ‌ల‌కు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని దెమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లుపై ఘాటుగా స్పందించారు. నోట్ల ర‌ద్దు నుంచి డీ హుమానిటైజేష‌న్ (పౌర‌స‌త్వ) బిల్లు…చ‌రిత్ర ఈ క్రిమిన‌ల్ మినిస్ట‌ర్‌ల‌ని మ‌ర్చిపోవ‌చ్చు కానీ ఇలాంటి స‌మ‌యంలో మాట్లాడ‌కుండా సైలెంట్‌గా వుంటే మా లాంటి వాళ్ల‌ని చ‌రిత్ర క్ష‌మించ‌దు. అని సోష‌ల్ మీడియా వేదిక‌గా మండిప‌డ్డారు.

- Advertisement -

ఇండియా అగైనెస్ట్ సీఏఏ, ఇండియా అగైనెస్ట్ ఎన్ ఆర్ సి హ్యాష్ ట్యాగ్‌ల‌ని జ‌త‌చేశారు. ప్ర‌కాష్‌రాజ్ చేసిన ట్వీట్ కు సోష‌ల్ మీడియాలో భారీ స్థాయిలో మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. దీనిపై బీజేపీ వ‌ర్గాలు ప్ర‌కాష్‌రాజ్‌కు  ఎలాంటి కౌంట‌ర్ ఇస్తాయో చూడాలి. లేడీ సంపాద‌కురాలు గౌరీ లంకేష్ దారుణ హ‌త్య త‌రువాత నుంచి ప్ర‌కాష్‌రాజ్ బీజేపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతూ జ‌స్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్‌తో సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All