టాలీవుడ్ చరిత్రలో తిరుగులేని రోజుగా మారింది ఈరోజు ఎందుకంటే ఈరోజు ఆరు చిత్రాలు విడుదల కాగా మూడు చిత్రాల ఊసే లేదు ఇక మిగిలిన మూడు చిత్రాల్లో మూడుకి మూడు హిట్ టాక్ సొంతం చేసుకోవడం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది . ఈరోజు రిలీజ్ అయిన వాటిలో బ్రాండ్ బాబు , చిలసౌ , గూఢచారి చిత్రాలు విజయాలు నమోదు చేయడంతో ఆ చిత్ర బృందాలు చాలా చాలా సంతోషంగా ఉన్నాయి . బుల్లితెర మెగాస్టార్ గా పేరుగాంచిన వ్యక్తి ప్రభాకర్ దర్శకత్వం వహించిన బ్రాండ్ బాబు చిత్రానికి కూడా హిట్ టాక్ వచ్చింది . ఎంటర్ టైన్ మెంట్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది . ఈ చిత్రానికి దర్శకులు మారుతి కథ , కథనం అందించడం విశేషం .
అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా నటించిన చిలసౌ కూడా డీసెంట్ చిత్రంగా పేరు తెచ్చుకుంది . రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నాగార్జున తో పాటు నాగచైతన్య , సమంత లు ఫుల్ సపోర్ట్ చేసారు . ఇక టాక్ కూడా ఈ సినిమాకు చాలా బాగుంది . యూత్ ని ఆకట్టుకునే చిత్రంగా . ఇక మూడో సినిమా విషయానికి వస్తే ……… గూఢచారి నేపథ్యంలో అప్పట్లో తెలుగులో సినిమాలు వచ్చేవి కానీ ఈతరానికి మాత్రం అంతగా తెలీదు దాంతో అడవి శేష్ ఆ ప్రయత్నం చేసి ప్రేక్షకులను అలరింప జేస్తున్నాడు .ఇలా ఈరోజు విడుదలైన మూడు సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో బయ్యర్లు చాలా సంతోషంగా ఉన్నారు . అయితే టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు సాధించే చిత్రాలు ఏవి అన్నది మరో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది .
English Title: history made : three tollywood hits in on day