Homeటాప్ స్టోరీస్సందీప్ కిష‌న్ ప‌దేళ్ల `ప్రస్థానం`!

సందీప్ కిష‌న్ ప‌దేళ్ల `ప్రస్థానం`!

సందీప్ కిష‌న్ ప‌దేళ్ల `ప్రస్థానం`!
సందీప్ కిష‌న్ ప‌దేళ్ల `ప్రస్థానం`!

సందీప్ కిష‌న్.. టాలీవుడ్‌లో పేరున్న టెక్నీషియ‌న్ చోటా కె. నాయుడు మేన‌ల్లుడే అయినా ఆ ప్ర‌భావం  త‌న‌పై ప‌డ‌కుండా `ప్ర‌స్థానం` సినిమాతో ప‌దేళ్ల క్రితం స‌రిగ్గా ఇదే రోజు (ఏప్రిల్ 16న‌) త‌న న‌ట ప్ర‌స్థానాన్ని ప్రారంభించాడు. ఈ ప‌దేళ్ల సినీ ప్ర‌యాణంలో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు.

`షోర్ ఇన్ ద సిటీతో ఇందీ లోనూ స‌త్తా చాటుకున్నాడు. ఇటీవ‌ల విల‌క్ష‌ణ న‌టుడు మ‌ననోజ్ బాజ్‌పాయ్ న‌టించిన `ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్‌లోనూ న‌టించి ఆక‌ట్టుకున్నాడు. హీరోగానే కాకుండా తాజాగా నిర్మాగా కూడా మంచి మార్కులు సాధించాడు. ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్ న‌టిస్తున్న చిత్రం `A1ఎక్స్‌ప్రెస్‌`.
లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

- Advertisement -

డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌తో క‌లిసి హీరో సందీప్ కిష‌న్ నిర్మిస్తున్నాడు. త‌మిళ హిట్ చిత్రం `న‌ట్‌పే తునై` చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. గ‌త కొంత కాలంగా సందీప్ కిష‌న్ త‌న బాడీ లాంగ్వేజ్‌కు త‌గ్గ క‌థ‌ల్ని ఎంచుకుంటూ సెలెక్టీవ్‌గా చిత్రాలు చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All