సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే‘. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం (జూలై 12న) విడుదలైంది. మార్నింగ్ షో నుండి సినిమాకు హిట్ టాక్ రావడంతో యూనిట్ సంబరాల్లో మునిగింది. టపాసులు కాల్చి సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకున్నారు.
ఈ సెలబ్రేషన్స్లో సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘‘తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్యూ! ఎంతో నమ్మి సినిమా తీశాం. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారోనని టెన్షన్ పడ్డాను. ప్రతి ఒక్కరు ‘చాలా మంచి సినిమా తీశారు భయ్యా. ఫస్టాఫ్ అదిరిపోయింది. లాస్ట్లో ఎమోషన్ అదిరిపోయింది’ అని చాలా పాజిటివ్గా చెబుతున్నారు. వెరీ వెరీ హ్యాపీ. మేం మదర్ అండ్ ఫాదర్ ఎమోషన్ను ఇన్నాళ్లు బయటపెట్టలేదు. థియేటర్లలో ప్రేక్షకులకు సర్ప్రైజ్గా ఉండాలనుకున్నాం.
ఆ ఎమోషన్కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజుల తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఫోనులు చేశారు. కలెక్షన్లు బావున్నాయని చెబుతున్నారు. కలెక్షన్లు బావున్నాయంటే అంతమంది థియేటర్లకు వెళుతున్నారు. నాపై, మా సినిమాపై అంత నమ్మకం పెట్టి థియేటర్లకు వెళ్లినందుకు థాంక్యూ. నేను అంత సులభంగా ఏ విషయాన్నీ నమ్మను. ఎక్కువ టెన్షన్ తీసుకుంటాను. చాలా రోజుల తర్వాత ఎనర్జీ, ఎగ్జైట్మెంట్ వచ్చాయి. స్పెషల్ థ్యాంక్స్ టు తమన్. ప్రతి రివ్యూలో ఆర్ఆర్ ఇరగదీశాడని చెప్పారు. ఈ సక్సెస్ను సెలబ్రేట్ చేసుకోవడానికి రెండు రోజుల్లో సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నా. ప్రేక్షకుల దగ్గరకు వెళ్తున్నా. ప్రేక్షకులందరినీ నేరుగా కలవాలని అనుకుంటున్నా’’ అని అన్నారు.
అన్యా సింగ్ మాట్లాడుతూ ‘‘ గురువారం తిరుపతి వెళ్లాం. నెర్వస్గా ఉండటంతో మేం ఫోనులు స్విచ్ఛాఫ్ చేశాం. పాజిటివ్ రివ్యూలు చూసి సంతోషించా. సందీప్ కిషన్ ఈజ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. మా టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అని అన్నారు.
దయా పన్నెం మాట్లాడుతూ ‘‘మా బ్యానర్లో ఫస్ట్ ప్రొడక్షన్లో సక్సెస్ఫుల్ సినిమా వచ్చింది. మౌత్ టాక్ బావుంది. షోలు అన్నీ హౌస్ఫుల్ అవుతున్నాయి. షోలు పెంచమని అడుగుతున్నారు’’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత సుప్రియ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రి, సీతారామ్ పాల్గొన్నారు.