కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నెల దాటి పోవడంతో చాలా మంది సెలబ్రిటీలు ఎవరికి తోచింది.. ఎవరికి నచ్చింది వాళ్లు చేస్తున్నారు. క్వారెంటైన్ టైమ్ని ఖాలీగా గడిపేయకుండా కొత్త గా ఏం చేయాలో తెలుసుకుంటున్నారు. కొంత మంది దర్శకులు ఈ సమయాన్ని కొత్త కథలకు వినియోగిస్తుంటే హీరోలు, హీరోయిన్లు మాత్రం కొత్త కొత్త వీడియోలని పోస్ట్ చేస్తూ అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
హీరో రామ్ కూడా ఈ క్వారెంటైన్ టైమ్ని బాగానే వాడేస్తున్నారట. ఖాలీ సమయం చిక్కితే కొత్త కథలు వినడానికి ఆసక్తి చూపిస్తుంటారు రామ్. లాక్డౌన్ లో సమయం చిక్కడంతో కొత్త కథలు వింటున్నారట. లాక్డౌన్ తరువాత బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాల్ని పూర్తి చేయాలని రామ్ నిర్ణయించుకున్నారట. ఆ కారణంగానే కొత్త కథలు వింటున్నారని తెలిసింది.
ప్రస్తుతం రామ్ నటించిన చిత్రం `రెడ్`. తమిళ హిట్ చిత్రం `తడమ్` ఆధారంగా కిషోర్ తీరుమల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 9న రిలీజ్ చేయాలని డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ కరోనా కారణంగా రిలీజ్ని వాయిదా వేశారు. లాక్డౌన్ తరువాతే ఈ సినిమా రిలీజ్పై ఓ నిర్ణయం తీసుకుంటారు.