ప్రస్తుతం మన దేశంతో పాటు యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ పై పోరాట నేపథ్యంలో సినిమా తారలు అందరూ తమ వంతు ప్రయత్నంగా భారీ మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. ఇంకా అనేక మంది ధన రూపంలో కాకుండా అనేక రకాల వస్తువుల రూపంలో మరియు కార్మికులకు వేతనాలు రూపంలో తమ సహాయాలను అందిస్తున్నారు.
ఇక ఇటీవలే “అర్జున్ సురవరం” సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఫుల్ ఫామ్ లో దూసుకెళ్తున్న నటుడు నిఖిల్ సిద్ధార్థ తన వంతు ప్రయత్నంగా ఓ వినూత్న మైన సాయాన్ని అందించారు.కరోనా వైరస్ పై ప్రత్యక్షంగా పోరాడుతున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి ఉపయోగపడే విధంగా…
- 2000 N95 & F P2 రెస్పిరేటరీ లు
- 2000 రీ యూజబుల్ గ్లౌజులు
- కళ్ళను పరిరక్షించే 2000 అద్దాలు మరియు శానిటైజర్ లు
- 10 ,000 ఫేస్ మాస్కులు
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ప్రత్యేకించి కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించే వైద్యులకు మరియు సిబ్బందికి ఆయన అందచేసారు. ఇక కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన 21 రోజులు లాక్ డౌన్ ను అందరూ విధిగా పాటించాలని ప్రజలందరూ తమ ఇంటి వద్దే సురక్షితంగా ఉండాలనీ.. వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజిక దూరం పాటించాలని నిఖిల్ సిద్ధార్థ విజ్ఞప్తి చేశారు.