Homeటాప్ స్టోరీస్త‌మిళ సంఘాల‌కు సారి చెప్పిన దుల్క‌ర్‌!

త‌మిళ సంఘాల‌కు సారి చెప్పిన దుల్క‌ర్‌!

త‌మిళ సంఘాల‌కు సారి చెప్పిన దుల్క‌ర్‌!
త‌మిళ సంఘాల‌కు సారి చెప్పిన దుల్క‌ర్‌!

`మ‌మాన‌టి` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన మ‌ల‌యాళ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌. మ‌ల‌యాళ‌, త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో న‌టిస్తున్న ఈ క్రేజీ హీరో తాజాగా త‌మిళ సంఘాల‌కు క్ష‌మాప‌ణ చెప్పారు. దుల్క‌ర్ న‌టించి, నిర్మించిన చిత్రం `వ‌రానే అవ‌శ్య‌ముండు‌`. సురేష్ గోపీ, శోభ‌న కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంపై త‌మిళ వ‌ర్గాలు భ‌గ్గుమంటున్నాయి.

ఈ చిత్రంలోని ఓ స‌న్నివేశంలో త‌మిళుల‌ని కించ‌ప‌రిచే డైలాగ్‌లు వున్నాయ‌ట‌. దీని కార‌ణంగా త‌మ మ‌నో భావాలు దెబ్బ‌తిన్నాయ‌ని, హీరో కావాల‌నే త‌మ‌ని అవ‌మానించాడ‌ని త‌మిళ వ‌ర్గాలు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. వివాదం ముదురుతుండ‌టంతో దుల్క‌ర్ స్పందించారు. త‌ను నిర్మించి న‌టించిన ` వ‌రానే అవ‌శ్య‌ముండు‌` చిత్రంలోని ఆ స‌న్నివేశాన్ని ఉద్దేశ్య పూర్వ‌కంగా చేయ‌లేద‌ని, గ‌తంలో వ‌చ్చిన ఓ మ‌ల‌యాళ సినిమాలోని స‌న్నివేశాన్ని రిఫ‌రెన్స్‌గా తీసుకుని మాత్ర‌మే చేశామ‌ని వెల్ల‌డించాడు.

- Advertisement -

ఆ స‌న్నివేశం బాధించి వుంటే క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని సోష‌ల్  మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సంద‌ర్భంగా మ‌ల‌యాళ చిత్రం `ప‌ట్ట‌ణ ప్ర‌వేశం` చిత్రంలోని ఓ స‌న్నివేశాన్ని షేర్ చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All