టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ రైటర్ హరీష్శంకర్ మరో క్రేజీ ఆఫర్ని సొంతం చేసుకున్నారు. వరుణ్తేజ్ హీరోగా ఆయన చేసిన `గద్దలకొండ గణేష్` మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. నటుడిగా వరుణ్తేజ్కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు.
తాజాగా ఇదే సంస్థ హరీష్శంకర్తో మరో చిత్రాన్ని చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా 14 రీల్స్ ప్లస్ అధికారిక ట్విట్టర్లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. `గద్దలకొండ గణేష్` చిత్రం తరువాత పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్శంకర్గారితో కలిసి మరోసారి పనిచేయబోతుండటం గర్వంగా, ఆనందంగా వుంది. లాక్డౌన్ తరువాత ఇండస్ట్రీలో సాధారణ స్థితి మొదలైన తరువాత ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడిస్తాం` అని ట్వీట్ చేశారు.
హరీష్శంకర్ ప్రస్తుతం పవర్స్టార్ పవన్కల్యాణ్ తో చేయనున్న చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ని సిద్ధం చేసే పనిలో వున్నారు. ఈ సినిమా తరువాతే 14 రీల్స్ ప్లస్ సినిమా వుంటుందా? లేక ముందే వుంటుందా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఈ ప్రాజెక్ట్ విషయంలో మరింత స్పష్టత రావాలంటే లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.
We are proud and happy to be working with Powerful Director @harish2you garu again after #GaddalakondaGanesh!
More details to be announced once the Industry is back to business post lockdown!
— 14 Reels Plus (@14ReelsPlus) May 18, 2020