మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ దిగ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన `ఓకే బంగారం` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ రూపొందించిన `మహానటి` చిత్రంతో మరింతగా పేరు తెచ్చుకున్నారు. దీంతోతెలుగులో అతనికి మంచి డిమాండ్ ఏర్పడింది. చాలా మంది నిర్మాతలు దుల్కర్తో స్ట్రేయిట్ ఫిల్మ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో ముందుగా ఆ అవకాశాన్ని అశ్వనీదత్ సొంతం చేసుకున్నారు. ఓ విభిన్నమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని స్వయంగా నిర్మాత అశ్వనీదత్ వెల్లడించారు. ఎప్పుడు మొదలయ్యేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు కూడా. కానీ తాజాగా ప్లాన్ మారినట్టు తెలుస్తోంది.
అశ్వనీదత్ కుమార్తెలు ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మాతలుగా వ్యవహరించనున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ని ఇప్పటికే దుల్కర్ వినడం జరిగింది. కథ, స్క్రీన్ప్లే ఆకట్టుకోవడంతో ఈ చిత్రాన్ని చేయడానికి దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదని తెలిసింది. దుల్కర్ ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారని తెలిసింది.