`ప్రతిరోజు పండగే` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత దర్శకుడు మారుతి `పక్కా కమర్షియల్` పేరుతో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. మాచో మ్యాన్ గోపీచంద్ హీరోగా నటిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యువీ క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఇటీవలే ఈ చిత్రంతో పాటు టైటిల్ ని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. టైటిల్ నుంచే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆడియన్స్లో హాట్ టాపిక్గా మారిన ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ని మేకర్స్ తాజాగా శనివారం లాంఛనంగా యూసఫ్గూడాలోని పోలీస్ క్వార్టర్స్లో ప్రారంభించారు. జీఏ2 పిక్చర్స్, యువీ క్రియేషన్స్ బన్నీవాసు, మారుతీ ముచ్చటగా మూడవసారి కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు.
గోపీచంద్ నటిస్తున్న 29వ చిత్రమిది. దర్శకుడు మారుతికి 10వ చిత్రం. జీఏ2 పిక్చర్స్ బన్నీ వాసు, యువీ క్రియేషన్స్, మారుతీ హ్యాట్రిక్ హిట్ కోసం చేస్తున్న ఈ మూవీ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పేరుకు తగ్గట్టే పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం : జకేస్ బిజాయ్, ఛాయాగ్రహణం: కరమ్ చావ్ల, ఆర్ట్: రవీంద్ర, ఎడిటింగ్: ఎస్.బి. ఉద్ధవ్, సహనిర్మాత: ఎస్.కే.ఎన్. ఇందులో గోపీచంద్కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరన్నది మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.