సాయిధరమ్తేజ్ హీరోగా నటించిన చిత్రం `ప్రతి రోజు పండగే`. రాశిఖన్నా హీరోయిన్గా మారుతి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పతాకంపై యువ నిర్మాత బన్నీవాసు నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా తొలి రోజు తొలి ఆట నుంచే మంచి టాక్తో సక్సెస్ఫుల్గా ప్రదర్శింపబడుతోంది. కుటుంబ విలువలు, చక్కని భావోద్వేగ సన్నివేశాలతో మంచి సందేశాన్ని అందించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 23. 25 కోట్ల గ్రాస్ని కలెక్టట్ చేసి సాయధరమ్తేజ్ చిత్రాల్లోనే మంచి వసూళ్లని సాధిస్తున్న చిత్రంగా నిలిచింది.
సినిమా విడుదలై ఐదు రోజుల్లో యూఎస్ మార్కెట్లోనూ మంచి వసూళ్లని రాబడుతోంది. కుటుంబ విలువలే ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంపై, ఇందులో నటించిన సాయిధరమ్తేజ్, సత్యరాజ్, రావురమేష్ పాత్రలకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నుంచి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వరకు చాలా మంది ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా మెగా పవర్స్టార్ ఈ జాబితాలో చేరారు.
ఇటీవల ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా చూసిన మెగా హీరో రామ్చరణ్ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. విలువలతో కూడుకున్న చిత్రమిదని, ఈ చిత్రాన్ని తప్పకుండా అందరూ చూడాలని, మారుతి తను చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పారని, ఈ విషయంలో సాయితేజ్, మారుతితోపాటు ఎంటైర్ తమ వంతు శ్రమించారని ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని అభినందించారు.
రామ్చరణ్ ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే.
Credit: Facebook