నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `గాలి సంపత్`. శ్రీవిష్ణు, లవ్లీసింగ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. అనిల్కి మిత్రుడు, కో డైరెక్టర్గా వ్యవహరించిన ఎస్. కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీష్ దర్శకత్వం వహిస్తున్నారు.
మార్చి 11ని థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇదిలా వుంటే శనివారం ఈ చిత్ర ట్రైలర్ని స్టార్ డైరెక్టర్ రాజమౌళి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్ తో పాటు చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. ట్రైలర్లో రాజేంద్ర ప్రసాద్ `ఫిఫీ` అనే సౌండ్తోనే సంభాషణలు పలకడం విశేషం. ఈ క్రమంలో కమెడియన్ సత్యతో పలికించే హస్య సన్నివేశాలు బాగున్నాయి.
ఇక కొడుకు పాత్రలో శ్రీవిష్ణు `నేను కూడా మా నాన్నను కాస్త ఓపిగ్గా ప్రేమగా అడగాల్సింది సార్` అని చెబుతున్న డైలాగ్ వాళ్లిద్దరి మధ్య వున్న అనుబంధాన్ని తెలియజేస్తోంది. రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పరిస్థితుల్లో ఇరుక్కున్నట్టుగా కనిపిస్తోంది. ట్రైలర్ చివర్లో తనికెళ్ల భరణి చెబుతున్న `ప్రకృతికి ఏం తెలుసు ఎవరు మంచోళ్లో.. ఎవరు చెడ్డోళ్లో` అంటున్న డైలాగ్లు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Thank you all for the overwhelming response for #GaaliSampathTrailer❤️
Get Completely Entertained With Our #GaaliSampath from March 11th Worldwide✨@AnilRavipudi @lovelysingh0508 @YoursSKrishna #Anish @achurajamani @Shine_Screens @imagesparkent pic.twitter.com/FUt0A6LXLE
— Sree Vishnu (@sreevishnuoffl) February 27, 2021