రాజకీయాల్లో బిజీగా మారిపోయిన పవర్స్టార్ పవన్కల్యాణ్ రెండేళ్ల విరామం తరువాత మళ్లీ కెమెరా ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. రాకెట్ స్పీడుతో సినిమాలు చేయాలని పవన్ ప్లాన్ చేసుకున్నారని గత కొన్ని రోజులుగా వరుస కథనాలు షికారు చేస్తున్నాయి. ఆ వార్తల్ని నిజం చేస్తూ పవన్ ఒక్కో ప్రాజెక్ట్ని సైలెంట్గా పట్టాలెక్కిస్తున్నారు.
`పింక్` రీమేక్తో పవన్కల్యాణ్ మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. దిల్ రాజుతో కలిసి బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో వుండగానే మరో చిత్రాన్ని కూడా మొదలుపెట్టేశారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 29న హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైంది. తాజాగా మరో చిత్రాన్ని కూడా పవన్ ట్రాక్లోకి తీసుకొస్తున్నారు.
`గబ్బర్సింగ్`తో బ్లాక్ బస్టర్ హిట్ని అందించిన హరీష్శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో వుండే అవకాశాలు వున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సంస్థ ఈ రోజు అధికారికంగా వెల్లడించింది. దీంతో ఒకే ఏడాది పవన్ మూడు చిత్రాలతో ఫ్యాన్స్కి భారీ ట్రీట్ ఇవ్వబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.
???
Extremely Delighted to collaborate with Power Star @PawanKalyan garu and Powerful Director @harish2you garu after Gabbar Singh ???
More Details Soon!#PSPK28
???
— Mythri Movie Makers (@MythriOfficial) February 1, 2020
Credit: Twitter