యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ `ఆది పురుష్`. ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ మూవీ ఇది. రామయణ గాథ నేపథ్యంలో 3డీ ఫార్మాట్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్నారు. టి. జపసిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్స్పై భూషణ్కుమార్, కృష్ణకుమార్, ఓంరౌత్, ప్రశాంత్ సుతాన్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. అయితే ఇందులో ప్రభాస్కు జోడీగా సీత పాత్రలో ఎవరు నటిస్తారన్నది గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారింది. అనుష్క నటిస్తుందని కొన్ని రోజుల లేదు ఆ పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుందని ఆ తరువాత జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రంలో సీత పాత్రని ఫైనల్ చేశామని శుక్రవారం చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో ప్రభాస్కు జోడీగా కృతిసనన్ ని ఫైనల్ చేసినట్టు ప్రకటించారు.
ఇక లక్ష్మణుడి పాత్రని కూడా ఫైనల్ చేసేశారు. ఈ పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటించబోతున్నాడు. శుక్రవారం ప్రభాస్, కృతిసనన్, సన్నీ సింగ్ డైరెక్టర్ ఓం రౌత్తో కలిసి సంప్రదాయ దుస్తుల్లో ఫొటోలకు పోజిలిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇటీవలే ముంబైలో రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
A new journey begins.. ❤️
One of my most special ones.. overwhelmed to be a part of #Adipurush #Prabhas #SaifAliKhan @mesunnysingh @omraut #BhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries pic.twitter.com/198BqAuoXT— Kriti Sanon (@kritisanon) March 12, 2021