Homeటాప్ స్టోరీస్రెండు నెల‌ల నిరీక్ష‌ణ ఫ‌లించింది!

రెండు నెల‌ల నిరీక్ష‌ణ ఫ‌లించింది!

రెండు నెల‌ల నిరీక్ష‌ణ ఫ‌లించింది!
రెండు నెల‌ల నిరీక్ష‌ణ ఫ‌లించింది!

క‌రోనా ప్ర‌బ‌లుతున్న వేళ రాబోయే ప‌రిస్థితుల్ని అంచ‌నా వేయ‌డంలో మ‌ల‌యాళ హీరో పృథ్వీరాజ్ విఫ‌ల‌మ‌య్యారు. ఆయ‌న హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆడు జీవితం`. వ‌రుస విభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తూ స‌క్సెస్ సాధిస్తున్న పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఈ సినిమా చిత్రీక‌ర‌ణ కోసం 58 మంది టీమ్‌తో కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం జోర్దాన్ వెళ్లారు.

జోర్డాన్‌లోని ఓ కీల‌క ప్రాంతంలో షూటింగ్ జ‌రుగుతున్న వేళ యావ‌త్ ప్ర‌పంచం క‌రోనా బారి నుంచి త‌ప్పించుకోవ‌డం కోసం లాక్‌డౌన్‌ని ప్ర‌క‌టించింది. దీంతో జ‌న‌జీవితం పూర్తిగా స్థంభించిపోయింది. అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు సైతం ఆగిపోవ‌డంతో హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ 58 మంది టీమ్‌తో జోర్డాన్‌లోనే ఇరుక్కుపోవాల్సి వ‌చ్చింది.

- Advertisement -

ఎప్పుడు విమాన స‌ర్వీసులు మొద‌ల‌వుతాయా? ఎప్పుడు ఇండియా వెళ‌తామా అని గ‌త రెండు నెల‌ల నుంచి ఎదురుచూస్తున్న ఈ చిత్ర టీమ్‌కి తాజాగా కేంద్రం శుభ‌వార్త చెప్పింది. భార‌త ప్ర‌భుత్వం వందే భార‌త్ మిష‌న్ పేరుతో విదేశాల్లో చిక్కుకు పోయిన వారిని స్వ‌దేశానికి తిరిగితీసుకురావ‌డం మొద‌లుపెట్టింది. దీంతో `ఆడు జీవితం` టీమ్ తిరిగి ఈ రోజే కొచ్చీ చేరుకుంది. దీనికి సంబంధించిన ఫొటోల‌ని అమ‌న్‌కి సంబంధించిన అఫీషియ‌ల్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్గా మారాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All