కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో అన్ని రంగాలన్నీ మూతపడ్డాయి. అందులో సినీ ఇండస్ట్రీ కూడా సెల్ఫ్ లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్లు ఆగిపోయాయి. రిలీజ్ కావాల్సిన సినిమాలు ఆగిపోయాయి. ఈ సమయంలో వినోదానికి కేరాఫ్ అడ్రస్గా మారాయి డిజిటల్ ప్లాట్ ఫామ్స్. దీంతో లాక్డౌన్ సమయం నుంచి వీటికి భారీ డిమాండ్ ఏర్పడింది.
థియేటర్లు తెరుకోకపోవడంతో రిలీజ్కు సిద్ధంగా వున్న చిత్రాల్లో చాలా వరకు బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలన్నీ ఓటీటీల్లో విడుదలయ్యాయి. అందులో తెలుగు చిత్రాలు చాలా తక్కువ. డబ్బింగ్ సినిమాలే అత్యధికంగా విడుదలయ్యాయి. అయితే రిలీజ్కి రెడీగా వున్న వి, నిశ్శబ్దం చిత్రాలని తమ ఓటీటీలో రిలీజ్ చేయాలని అమెజాన్ ప్రైమ్ భారీ స్థాయిలో నిర్మాతలతో చర్చలు జరిపింది. అయినా తగ్గని నిర్మాతలు తమ చిత్రాలని ఓటీటీల్లో రిలీజ్ చేయడానికి ఆసక్తిని చూపించలేదు.
అయితే ఇప్పటి వరకు పరిస్థితుల్లో మార్పులు రాకపోవడంతో నేచురల్ స్టార్ నాని, సుధీర్బాబు తొలిసారి కలిసి నటించిన మల్టీస్టారర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం `వి`ని ఎట్టకేలకు నిర్మాత దిల్ రాజు అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయడానికి సిద్ధమైనట్టు తెలిసింది. ఇప్పటికే టాక్స్ పూర్తయిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 5న `వి` చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. 33 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి దిల్ రాజు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అంగీకరించలేదు. కానీ అమెజాన్ భారీ ఆఫర్ ఇవ్వడంతో మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.