విక్టరీ వెంకటేష్, వరుణ్తేజ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం `ఎఫ్2`. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం గత ఏడాది సంక్రాంతికి విడుదలై విజేతగా నిలిచింది. వరల్డ్ వైడ్గా వంద కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది.
ఈ సినిమా ఎండింగ్లోనూ సీక్వెల్ ప్లాన్స్ వున్నట్టు హింట్ ఇచ్చిన దర్శకుడు ప్రస్తుతం అదే పనిలో బిజీగా వున్నాడు. త్వరలో సీక్వెల్ ని చేయబోతున్నానని ఇటీవల `సరిలేరు నీకెవ్వరు` సమయంలో మీడియా ఇంటరాక్షన్లో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ని సిద్ధం చేసే పనిలో వైజాగ్లో బిజీగా వున్నాడు.
ఈ సీక్వెల్లో వెంకటేష్, వరుణ్ తేజ్లకు మాత్రమే జోటు కల్పించిన అనిల్ రావిపూడి హీరోయిన్లు తమన్నా, మెహరీన్లకు మాత్రం ఇందులో చోటు కల్పించడం లేదట. వీరిద్దరి స్థానంలో వేరు హీరోయిన్లని తీసుకోబోతున్నాడట. అంతేనా ఫస్ట్ పార్ట్కి మించి మూవీని మరింత గ్లామరస్గా రెడీ చేస్తున్నాడట. అందుకు కొత్త వాళ్లైతేనే బాగుంటుందని భావించాడట అనిల్ రావిపూడి. ఈ సీక్వెల్ని కూడా దిల్ రాజే నిర్మిస్తారట.