దర్శకుడు అనిల్ రావిపూడికి చాలా ఫాస్ట్ గా సినిమాలు తీయడం అలవాటు. ఇప్పటివరకూ తీసిన 5 సినిమాలకు కూడా ఎక్కువ సమయం తీసుకోలేదు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమా తీస్తున్న విషయం తెల్సిందే. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా చేస్తోన్న ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.
ఎఫ్3 చిత్రం ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈలోగా కరోనా సెకండ్ వేవ్ రావడంతో బ్రేకులు పడ్డాయ్. ఇప్పుడు మళ్ళీ ఎఫ్3 షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నాడు అనిల్ రావిపూడి. వీలైనంత త్వరగా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
జులై1 న చిన్న షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలవుతుంది. ఆ తర్వాత మెజారిటీ షూటింగ్ జులై మధ్య నుండి మైసూర్ లో ఉంటుంది. ఈ మైసూర్ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాడు అనిల్ రావిపూడి. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.