కరోనా వైరస్ కారణంగా అవుట్ డోర్ షూటింగ్ చేయాలంటే చాలా మంది భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి సమయంలో తన సినిమా షూటింగ్ని ప్రారంభించి నెల రోజుల్లోనే పూర్తి చేసి దర్శకుడు వేగేశ్న సతీష్ ఆశ్చర్యపరిచారు. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `కోతికొమ్మచ్చి`. నవంబర్ 3న ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ మొదటి వారానికి ఒక్క పాట మినహా పూర్తి కావడం విశేషం.
మేఘాంష్ శ్రీహరి, సమీర్ వేగేశ్న హీరోగా నటిస్తున్నారు. రిద్ది కుమార్, మేఘా చౌదరి హీరోయిన్లు. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నా
`కరోనా కష్టకాలంలో కూడా అనుకున్న విధంగా మా సినిమా షూటింగ్ని ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేశాం. ముఖ్యంగా మా దర్శకుడు సతీష్ గారు పర్ఫెక్ట్ ప్లానింగ్తో షూటింగ్ పూర్తి చేశారు. మాకు సహకరించి సినిమా కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికి మా ప్రొడక్షన్ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటించి ప్రేక్షకుల్ని థియేటర్లలో కలుసుకుంటాం` అని నిర్మాత ఎం.ఎల్.వి. సత్యనారాయణ అన్నారు.