ఒక భాషలో హిట్టయితే ఈ మూవీకి ఇతర భాషల్లో భారీ డిమాండ్ ఏర్పడుతోంది. అలాంటి డిమాండ్ ఇప్పుడు మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ నటించిన దృశ్యం 2` చిత్రానికి ఏర్పడింది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్లాల్ హీరోగా నటించిన చిత్రమిది. ఇందులోని కీలక పాత్రల్లో మీనా, ఏస్తర్ అనిల్, హన్సిబ హసన్, ఆశా శరత్, సిద్ధిక్ నటించారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ చిత్రం `దృశ్యం`కు సీక్వెల్గా తెరకెక్కింది. ఓటీటీలో అనూహ్య విజయాన్ని సాధించడమే కాకుండా విమర్శకులు ప్రశంసల్ని కూడా సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్, మీనాల కలయికలో రీమేక్ చేస్తున్నారు. జెట్ స్పీడుతో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డి. సురేష్ బాబు నిర్మించారు.
ఇదిలా వుంటే `దృశ్యం 2` బాలీవుడ్లోనూ రీమేక్ కాబోతోంది. గతంలో `దృశ్యం`ని రీమేక్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ ఈ మూవీ రీమేక్ హక్కుల్ని దక్కించుకున్నారు. ఈ విషయాన్ని పనోరమ స్టూడియోస్ వెల్లడించింది. కుమార్ మంగత్ పాథక్, అభిషేక్ పాథక్ మలయాళ హిట్ ఫిల్మ్ `దృశ్యం 2` `హిందీ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నారు` అని వెల్లడించింది.