అజయ్ దేవ్గన్ హీరోగా నటించిన చిత్రం `ద్రిశ్యం`. మలయాళ రీమేక్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రియా శరణ్, టబు, ఇషితా దత్తా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాని నిషికాంత్ కామత్ తెరకెక్కించారు. హిందీలో రీమేక్ అయిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సీఫీస్ వద్ద మంచి వసూళ్లని సాధించింది. ఈ చిత్ర దర్శకుడు నిషికాంత్ కామత్ తీవ్ర అనారోగ్యానికి గురై ఈ నెల 11న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు.
ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా వుందని, ఆయనకు వెంటిలేటర్పై చికిత్సఅందిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ఆయన తుది శ్వాస విడిచినట్టు రచయిత మిలాప్ జవేరి ట్వీట్ చేశారు. అంతే కాకుండా నిషికాంత్ కామత్ లివర్ ఇరోసిస్ సిండ్రోమ్ కారణంగా మృతి చెందారని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
అయితే ఈ వార్తల్లో నిజం లేదని, నిషికాంత్ కామత్ వెంటిలేటర్పై ఉన్నారని, ఆయన చనిపోయారంటూ ప్రచారం చేయొద్దని బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మరాఠీ చిత్రం తో జాతీయ పురస్కారం దక్కించుకున్న నిశికాంత్ కామత్ బాలీవుడ్లో రాఖీ హ్యాండ్సమ్, ముంబై మేరీ జాన్, ఫోర్స్, ముంబై మేరీజాన్ వంటి చిత్రాలు చేశారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం `దర్బదార్` చిత్రీకరణ దశలో వుంది.