Homeటాప్ స్టోరీస్బాక్స్ ఆఫీస్ వద్ద డీజే కలెక్షన్ల మోత మోగిపోతుంది

బాక్స్ ఆఫీస్ వద్ద డీజే కలెక్షన్ల మోత మోగిపోతుంది

బాక్స్ ఆఫీస్ వద్ద డీజే కలెక్షన్ల మోత మోగిపోతుంది
బాక్స్ ఆఫీస్ వద్ద డీజే కలెక్షన్ల మోత మోగిపోతుంది

బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రాలు భారీ ప్లాప్ అయ్యి షాక్ ఇస్తే..కొన్ని సినిమాలు మాత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాలు సాధిస్తాయి. తాజాగా డీజే టిల్లు విషయంలో అదే జరిగింది. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్ లుగా నటించిన తాజా చిత్రం డీజే టిల్లు.

ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సిద్ద యాక్టింగ్ యూత్ ఫిదా అవుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద డీజే కలెక్షన్ల మోత మోగిపోతుంది. ఫస్ట్ డే నుండి మొదలుపెడితే రోజు రోజుకు కలెక్షన్లు పెరగడం , థియేటర్స్ సంఖ్య పెరగడం జరుగుతుంది.

- Advertisement -

4వ రోజూ ఈ మూవీ కలెక్షన్లు చూస్తే..

* నైజాంలో రూ. 55 లక్షలు
* సీడెడ్‌లో రూ. 15 లక్షలు
* ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు
* ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు
* వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు
* గుంటూరులో రూ. 6 లక్షలు
* కృష్ణాలో రూ. 6 లక్షలు
* నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి రూ. 1.09 కోట్లు షేర్, రూ. 1.70 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

నాలుగు రోజులకు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

* నైజాంలో రూ. 4.28 కోట్లు
* సీడెడ్‌లో రూ. 1.14 కోట్లు
* ఉత్తరాంధ్రలో రూ. 77 లక్షలు
* ఈస్ట్ గోదావరిలో రూ. 47 లక్షలు
* వెస్ట్ గోదావరిలో రూ. 56 లక్షలు
* గుంటూరులో రూ. 43 లక్షలు
* కృష్ణాలో రూ. 36 లక్షలు
* నెల్లూరులో రూ. 28 లక్షలతో కలిపి రూ. 8.29 కోట్లు షేర్, రూ. 14.70 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All