గత రేంత కాలంగా రేసులో వెనకబడ్డ దర్శకుడు తేజ `నేనే రాజు నేనే మంత్రి` చిత్రంతో మళ్లీ ఫామ్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్తో చేసిన `సీత` అట్టర్ ఫ్లాప్గా నిలిచినా మళ్లీ తన వైభవాన్ని చాటుకోవాలని తేజ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఒకేసారి రెండు ప్రాజెక్ట్లని ప్రకటించి ఆశ్చర్యపరిచారు.
గోపీచంద్ హీరోగా `అలిమేలు మంగ వెంకటరమణ`, రానా హీరోగా `రాక్షస రాజు రావణాసురుడు` పేరుతో రెండు భారీ చిత్రాల్ని ప్రకటించారు. ఇందులో ఏ చిత్రాన్ని ముందు మొదలుపెడుతున్నారో తెలియదు కానీ తన కొత్త సినిమా కోసం టాలెంట్ హంట్ ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించాడు. ఇందు కోసం చైనాకు చెందిన హాలో యాప్ని వాడుకోమని, టిక్ టాక్ వీడియోలు పరిగణించబడవని ఓ ప్రకటన విడుదల చేశాడు.
ఇదే పెద్ద అడ్డంకిగా మారే అవకాశం వుందని తాజాగా తెలుస్తోంది. ఇండియా, చైనా మధ్య లద్దాక్ సమీపంలోని గాల్వామాలో ఘర్షణ జరగడం మన వాళ్లు కల్నల్తో సహా 20 మంది మరణించడంతో కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు చైనాకు సంబంధించిన యాప్లని వాడొద్దంటూ హెచ్చరిస్తున్న నేపథ్యంలో చైనాకు చెందిన హెలో యాప్తో తేజ టాలెంట్ హంట్ నిర్వహించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో తేజ పునరాలోచిస్తారా? లేక అదే యాప్తో టాలెంట్ హంట్ని నిర్వహిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.