కరోనా కారణంగా జన జీవితం స్థంభించిపోయింది. నిత్యం ఏదో ఒక పని చేసుకుంటే కానీ కడుపు నిండని కష్టజీవులు పని లేక తినడానికి తిండి లేక అల్లాడుతున్నారు. ఆకలి తీర్చేవారు లేక కొంత మంది ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. మంచి నీళ్లు బిస్కట్లతో కాలం వెల్లదీస్తున్నారు. వారిని ఆదు కోవాలని ఎన్ని స్వచ్ఛంద సంస్థలు ఎంత సహాయం అందిస్తున్నా అందరికి చేరడం లేదు.
ఇదిలా వుంటే ట్రాన్స్ జెండర్స్ డబ్బులు లేక ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడానికి ఎంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా మంది సహయానికి దూరంగానే వుంటున్నారు. హైదరాబాద్లో వున్న కొంత మంది ట్రాన్స్ జెండర్స్కి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సహయం చేశారు.
అయితే ఆ విషయాన్ని ఆయన ఏ మీడియాకీ వెల్లడించలేదు. పబ్లిసిటీ కోసం ఫొటోలకు పోజులివ్వడానికీ ఇష్కటపడలేదు. దీంతో ట్రాన్స్ జెండర్సే ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయట పెట్టి శేఖర్ కమ్ములకు కృతజ్ఞతలు తెలపడంతో ఆయన చేసిన సాయం బయటపడింది.