25 ఏళ్ల డ్రీమ్ నెరవేరితే ఆ ఆనందక్షణాలని వర్ణించలేం. ఇప్పుడు అదే ఆనందాన్ని అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతున్నారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. నిర్మాతగా ఎన్ని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించినా, జాతీయ స్థాయిలో అవార్డుల్ని అందించిన చిత్రాల్ని నిర్మించినా 25 ఏళ్లుగా దిల్రాజులో ఓ తీరని కోరిక ఒకటి మిగిలి పోయింది. నిర్మాతగా ఎదుగుతున్నా ఆ కోరిక ఏళ్ల తరబడి ఆయనని వెంటాడుతూనే వుంది. అదే పవర్స్టార్ పవన్కల్యాణ్తో సినిమా చేయడం.
ఆ డ్రీమ్ `వకీల్సాబ్`తో సాకారమైంది. పవర్స్టార్ పవన్కల్యాణ్ మూడేళ్ల విరామం తరువాత నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రంపై వరల్డ్ వైడ్గా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచే థియేటర్ల వద్ద `వకీల్సాబ్` సందడి మొదలైంది. ఎంపిక చేసిన థియేటర్లలో ఉదయం హైదరాబాద్లో షోలు మొదలయ్యాయి. దీంతో దిల్ రాజు తన భార్యతో కలిసి శివ పార్వతి థియేటర్ లో అభిమానుల మధ్య సినిమా చూసేందుకు వెళ్లారు. పవన్ నిజమైన అభిమానిలా ఎంజాయ్ చేశారు.
దిల్ రాజు థియేటర్లో ఫ్యాన్ బాయ్ క్షణాన్ని ఎంజాయ్ చేశారు. తెరపై పవన్ కళ్యాణ్ కనిపించే క్షణం కోసం ఎదురుచూసిన దిల్ రాజు మిగతా అభిమానుల మాదిరిగానే తెరపై పవన్ ఎంట్రీ ఇవ్వగానే పేపర్లు విసిరి తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల ఇతర పాత్రల్లో నటించారు.
@SVC_official Dil Mama Masss ????????????????#CultFan @PawanKalyan ????#Ustaad Entry #ShivaParvathi #VakeelSaabFDFS#VakeelSaabManiaAllOver#VakeelSaabFestivalBegins pic.twitter.com/mEdu30ajo4
— సాయి బండ్రెడ్డి ❣️✊ (@saibandreddi) April 8, 2021