విక్టరీ వెంకటేష్, వరుణ్తేజ్ హీరోలుగా తొలిసారి కలిసి నటించిన ఫ్యామిలీ బొనాంజా `ఎఫ్2`. తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా నటించారు. అనిల్ రావిపూడి తనదైన మార్కు ఎంటర్టైన్మెంట్ ని జోడించి ఫ్యామిలీ ఆడియన్స్కి సందేశంతో పాటు వినోదాన్ని అందించిన చిత్రమిది. బాక్సాఫీస్ వద్ద దాదాపు వం కోట్లకు మించి వసూళ్లని సాధించి ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేసింది.
ఈ బ్లాక్ బస్టర్ హిట్కి సీక్వెల్గా `ఎఫ్3`ని తెరపైకి తీసుకురావాలని అనిల్ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే లాక్డౌన్ టైమ్లో మెయిన్ ప్లాట్ని కంప్లీట్ చేసిన అనిల్ ప్రస్తుతం స్క్రీన్ప్లేని పూరి్త చేస్తున్నారట. చాలా రోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ని ప్రకటించినా కరోనా వైరస్, లాక్డౌన్ కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. పైగా దిల్ రాజు `వకీల్ సాబ్`, `జెర్సీ` హిందీ రీమేక్ నిర్మాణ పనుల్లో బిజీగా వుండటంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వస్తోంది.
సెంటిమెంట్ ప్రకారం ఈ మూవీ ఆఫీస్ని శ్రీనగర్ కాలనీలో దిల్ రాజు తీసుకున్నట్టు తెలుస్తోంది. సాగర్ సొటైటీలో ప్రధాన ఆఫీస్ వున్నా ఎస్పెషల్లీ `ఎఫ్3` సిట్టింగ్స్ కోసం శ్రీనగర్ కాలనీలో ప్రత్యేకంగా ఓ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నారట. అందులోనే `ఎఫ్3`కి సంబంధించిన వర్క్ మొత్తం ఫినిష్ చేయమని అనిల్ రావిపూడికి దిల్ రాజు చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. `నారప్ప`లో నటిస్తున్న వెంకటేష్, స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న వరుణ్ తేజ్ తమ రెండు చిత్రాల్ని పూర్తి చేసి డిసెంబర్ నుంచి `ఎఫ్3`ని మొదలుపెట్టనున్నట్టు తెలిసింది.