టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్షితరెడ్డి సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది.తన తల్లి అనితకు సంబంధించిన ఓ ఫొటోని షేర్ చేసిన హన్షిత దానికి ఓ ఎమోషనల్ పోస్ట్ని జతచేసింది. ఉన్నట్టుండి హన్షితకు తల్లి అనిత గుర్తుకు రావడానికి కారణం ఈ రోజు ( శుక్రవారం) ఆమె జయంతి. ఈ సందర్భంగా తల్లి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్న హన్షిత తల్లి తో వున్న ఓ ఫోటోని షేర్ చేసింది.
`పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా.. నేను నిన్ను చాలా మిస్సవుతున్నా..నీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నాతోనే వుంటాయి. వాటితోనే జీవిస్తున్నా. కొన్ని రోజులు నేను నీతో వున్న ఎన్నో జ్ఞాపకాలు.. నీతో కలిసి దిగిన ఫొటోలు.. నీ చిరునవ్వు దృశ్యాలెన్నో.. ` అంటూ భావోద్వేగభరింతమైన పోస్ట్ని షేర్ చేసింది. దిల్ రాజు ఇటీవలే వైఘారెడ్డిని రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
దిల్ రాజు మొదటి భార్య అనిత అనారోగ్య కారణంగా 2017లో మృతి చెందింది. ఆ తరువాత నుంచి దిల్ రాజు ఒంటరిగానే వుంటున్నారు. తన తండ్రి ఒంటరిగా వుండటం ఇష్టం లేని హన్షితరెడ్డి ఒప్పించి తేజస్వినితో వివాహం జరిపించింది. వివాహం తరువాత తేజస్విని పేరుని వైఘారెడ్డిగా దిల్రాజు మార్చేసిన విషయం తెలిసిందే.