ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్ల హంగామా నడుస్తోంది. ఈ తరహా చిత్రాలు ప్రేక్షకులకి అమితంగా పనచ్చడంతో మేకర్స్ విజేతల గాధల్ని తెరపైకి తీసుకొస్తున్నారు. తాజాగా స్పోర్ట్ప్ పర్సన్స్ నేపథ్యంలో వరుసగా బయోపిక్లు తెరపైకొస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్లో కొన్ని ఈ తరహా చిత్రాలు తెరపైకొచ్చి భారీ విజయాల్ని సాధించాయి కూడా. తాజాగా పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, మిథాలీరాజ్ల బయోపిక్లు లైన్లో వున్నాయి.
ఇందులో ఇప్పటికే మిథాలీ రాజ్ బయోపిక్ టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయింది. తాప్సీ ఇందులో నటిస్తోంది. ఇక సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా సెట్స్పైనుంది. ఇందులో శ్రద్ధా కపూర్ కీలక పాత్రలో నటిస్తోంది. పుల్లెల గోపీచంద్ జీవిత కథ ఇంకా పట్టాలెక్కలేదు. సుధీర్బాబు ఈ చిత్రంలో నటించబోతున్నారు. హక్కుల విషయంలో ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయి.
ఇదిలా వుంటే పీవీ సింధు జీవిత కథ ఆధారంగా కూడా ఓ సినిమా తెరపైకి రాబోతోంది. ఈ చిత్రాన్ని సోను సుద్ నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఆయన ఈ ప్రాజెక్ట్ని ప్రకటించారు. అయితే ఇందులో ఎవరు నటిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. చాలా మంది ఆసక్తి చూపించినా సోను మాత్రం పీవీ సింధు పాత్రలో దీపిక పదుకునేని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఓ సారి ఈ విషయాన్ని ఆమె దాకా తీసుకెళ్లారు కూడా. దీపిక ఈ చిత్రానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కానీ డేట్స్ కేటాయించలేదు. ఆమె డేట్స్ ఎప్పుడు కేటాయిస్తే అప్పుడు సింధు బయోపిక్ని స్టార్ట్ చేస్తారట. అయితే మధ్యలో సింధు పాత్ర కోసం సమంత పాత్ర కూడా వినిపించడంతో అందులో ఎలాంటి వాస్తవం లేదని సోనుసుద్ ప్రకటించారు.