Homeటాప్ స్టోరీస్క‌రోనా ఎఫెక్ట్ : మ‌రో రెండు సినిమాల రిలీజ్ వాయిదా?

క‌రోనా ఎఫెక్ట్ : మ‌రో రెండు సినిమాల రిలీజ్ వాయిదా?

క‌రోనా ఎఫెక్ట్ : మ‌రో రెండు సినిమాల రిలీజ్ వాయిదా?
క‌రోనా ఎఫెక్ట్ : మ‌రో రెండు సినిమాల రిలీజ్ వాయిదా?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. దీని ధాటికి ప్ర‌జ‌లంతా బెంబేలెత్తిపోతున్నారు. సామాన్యులు ప్రాణాల్ని అర‌చేతుల్లో పెట్టుకుని కాలం వెల్ల‌దీస్తున్నారు. ఇక సినిమా వాళ్లు త‌మ సినిమాల షూటింగ్‌ల‌ని వాయిదా వేసుకుంటున్నారు. కొంత మందేమో సినిమా రిలీజ్‌ల‌ని కూడా పోస్ట్‌పోన్ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న `వ‌కీల్‌సాబ్‌` రిలీజ్‌ని కూడా వాయిదా వేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల దిల్ రాజు నిర్మిస్తున్న మరో చిత్రం `వి` రిలీజ్ కూడా ఏప్రిల్‌కు వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే.

ముందు ఈ చిత్రాన్ని ఇదే నెల 25న ఉగాది కానుక‌గా రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తున్న నేప‌థ్యంలో `వి` రిలీజ్‌ని కాస్త ఏప్రిల్‌కి వాయిదా వేశారు. తాజాగా ఇదే వ‌రుస‌లో మ‌రో రెండు చిత్రాల రిలీజ్‌లు వాయిదా ప‌డిన‌ట్టు తెలిసింది. అందులో అనుష్క న‌టిస్తున్న `నిశ్శ‌బ్దం` ఒక‌టి కాగా మ‌రొక‌టి వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న `ఉప్పెన‌`. కోన వెంక‌ట్‌తో క‌లిసి టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్న `నిశ్శ‌బ్దం` చిత్రాన్ని ముందు ఏప్రిల్ 2న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు.

- Advertisement -

వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న `ఉప్పెన‌` చిత్రాన్ని మైత్రీమూవీమేక‌ర్స్‌తో క‌లిసి ద‌ర్శ‌కుడు సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా ఏప్రిల్ 2నే రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ రెండు చిత్రాల రిలీజ్ ని వాయిదా వేసిన‌ట్టు తెలిసింది. మ‌రో డేట్‌ని చిత్ర వ‌ర్గాలు ప్ర‌క‌టించ‌నున్నాయ‌ట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All