Homeటాప్ స్టోరీస్ఆ సినిమాపై కుట్ర జరుగుతోందట నిజమా

ఆ సినిమాపై కుట్ర జరుగుతోందట నిజమా

conspiracy on ys rajasekhar reddy biopicమలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా తెలుగులో నటిస్తున్న చిత్రం ” యాత్ర ” . మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో తెరెక్కుతున్న విషయం తెలిసిందే . అయితే ఈ చిత్రంపై కుట్ర జరుగుతోంది అంటూ ఓ కథనం వెలువడటం సంచలనంగా మారింది . విజయ్ చిల్లా శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వై ఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి అండ లేదని ఎందుకంటే ఈ సినిమాలో కాంగ్రెస్ నాయకుడిగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రని చిత్రీకరిస్తున్నారు కానీ జగన్ కు అనుకూలంగా కాదని ఓ కథనం హల్చల్ చేస్తోంది .

అందుకే యాత్ర సినిమా కు జగన్ సహకరించడం లేదని కథనాలు వస్తున్నాయి . ఆ కథనాలు పక్కన పెడితే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేసాడు . ఆ పాదయాత్ర తర్వాతే ప్రజలు బ్రహ్మరథం పట్టారు , ముఖ్యమంత్రి ని చేసారు . మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక కొద్దిరోజులకే ఘోర విషాదకర సంఘటనలో చనిపోయాడు కాబట్టి జగన్ పాత్ర పెద్దగా ఉండదని ఒకవేళ ఉన్నా అతడికి సానుకూలంగా ఉండదని అంటున్నారు . వై ఎస్ బయోపిక్ పై కుట్ర సంగతి ఇప్పుడు పెద్ద చర్చ గా మారింది . ఎవరు కుట్ర చేస్తున్నారో ? లేదో తేలలేదు కానీ రకరకాల కథనాలు మాత్రం వినబడుతున్నాయి కుట్ర కోణంలో .

- Advertisement -

English Title: conspiracy on ys rajasekhar reddy biopic

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All